మెండే రాజు నేటి వార్త : ఉప్పుమడుగులో ముమ్మరంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ పనులు
రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఉప్పుమడుగు గ్రామంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ ప్రణాళికలో భాగంగా ఆదివారం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భవనాలు పాఠశాల బస్టాండ్ ఆవరణలను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు
గ్రామ సర్పంచ్ కొత్తకొండ రోజా స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ 99 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు బస్టాండ్ పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బందితో కలిసి తొలగించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్లెపు గంగాధర్
వార్డ్ సభ్యులు మెండే రాజు, మచ్చ రాధ పంచాయతీ కార్యదర్శి మొగిలి శ్రీహరి వైద్య ఆరోగ్య సిబ్బంది ఏ.ఎన్.ఎం. సంగీత, ఆశవర్కర్ రజిత గ్రామ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు