టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఫిబ్రవరి 23: హైదరాబాద్ కు చెందిన శ్రీ సాతుళూరి తాండవ కృష్ణ మూర్తి అనే భక్తుడు సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.