నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో కోడి పందాల స్థావరంపై రూరల్ పోలీసులు మెరుపు దాడి .
నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో కోడి పందాల స్థావరంపై రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 07 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 06 కోడి పుంజులు, 02 కోడి కత్తులు, 06 బైకులు, రూ.5,440 నగదు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే రేగుంట గ్రామంలో పేకాట నిర్వహిస్తున్న 03 మందిని పట్టుకుని రూ.4,340 నగదు స్వాధీనం చేసుకున్నారు.
జూదం, కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు రూరల్ పోలీసులు హెచ్చరించారు.