ముందస్తు బుకింగ్ పేరుతో బురిడీ... నిందితుడి అరెస్ట్
జర్నలిస్ట్: ఆకుల గణేష్
హన్మకొండ సీఐ మచ్చ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, బాలాజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో సోలిపేట ప్రభాకర్ రెడ్డి, కోడూరు లక్ష్మీ, SVB VAIBHAV ప్రాజెక్టు పేరుతో సెవెన్ ఫ్లోర్స్ లో 164 అపార్ట్మెంట్లు కడుతున్నామని, ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ఇస్తామని నమ్మించి మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హనుమకొండ ఏనుగుల గడ్డకు చెందిన బందెల్లి స్వర్ణ అనే మహిళ వద్ద నుంచి 81 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిపారు.