ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ.. మరో కీలక ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది.....
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి
శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో ఎటాక్.. సముద్రంలో మునిగిన నౌక
LATEST
3 రోజులు రూ.21 లక్షల కోట్లు
దేశంలో ఎల్ఎన్జీ కొరత
6 ప్రత్యేక విమానాల్లో శంషాబాద్కు 600 మంది
పాక్లోని ఎంబసీలు వదిలి అమెరికా వచ్చేయండి..
యెజ్డి కొత్త బైక్ రెడ్ ఉల్ఫ్
ఖమేనీ అంత్యక్రియలు వాయిదా
ఇరాన్ నేవీ బృందం ఆఖరి మజిలీ
అమెరికాకు యుద్ధ నష్టం..రూ.18.87 లక్షల కోట్లు
అమెరికా నిఘా ఆయువుపట్టుపై దాడి
నువ్వా..నేనా?
అలెన్ విధ్వంసం
ఇరాన్ ఆడదా..! ‘ఐ డోంట్కేర్’
సాత్విక్ జోడీ ఇంటికి
3 రోజులు రూ.21 లక్షల కోట్లు
దేశంలో ఎల్ఎన్జీ కొరత
6 ప్రత్యేక విమానాల్లో శంషాబాద్కు 600 మంది
పాక్లోని ఎంబసీలు వదిలి అమెరికా వచ్చేయండి..
యెజ్డి కొత్త బైక్ రెడ్ ఉల్ఫ్
ఖమేనీ అంత్యక్రియలు వాయిదా
ఇరాన్ నేవీ బృందం ఆఖరి మజిలీ
అమెరికాకు యుద్ధ నష్టం..రూ.18.87 లక్షల కోట్లు
అమెరికా నిఘా ఆయువుపట్టుపై దాడి
నువ్వా..నేనా?
అలెన్ విధ్వంసం
ఇరాన్ ఆడదా..! ‘ఐ డోంట్కేర్’
సాత్విక్ జోడీ ఇంటికి
నౌకలోని 140 మందికి పైగా సిబ్బంది గల్లంతు
32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం
పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి
విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కు యుద్ధనౌక వెళ్తుండగా ఘటన
తామే దాడి చేశామన్న అమెరికా రక్షణ మంత్రి
ఇరాన్ రహస్య అణుకేంద్రం ధ్వంసం: ఐడీఎఫ్
టర్కీపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి.. అడ్డుకున్న నాటో
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి.. 50 మంది మృతి
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 1045 మంది మృతి.. ఇరాన్ వెల్లడి
యుద్ధం తొలి 2 రోజుల్లోనే 650 మంది అమెరికా సైనికుల్ని హతమార్చాం: ఐఆర్జీసీ
న్యూఢిల్లీ, మార్చి 4: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ.. మరో కీలక ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది. అది కూడా శ్రీలంక తీరం సమీపంలో ఈ దాడి జరిగింది. ఇరాన్కు చెందిన ఐఆర్ఐఎస్ దేనా నౌక.. భారత్లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగిన మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. శ్రీలంక తీరంలో అమెరికా జలాంతర్గామితో దాడికి పాల్పడింది. దీంతో ఇరాన్ నౌక సముద్రంలో మునిగిపోయింది. అందులోని 140 మందికిపైగా గల్లంతయ్యారు. 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది. అయితే తొలుత ఇరాన్ నౌక ప్రమాదానికి గురైందని భావించారు. ఈ నౌక గాలె తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు.. ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందించింది.