ఘనంగా శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో మహిళల భద్రత వాక్థాన్ కార్యక్రమం
పాణ్యం (AIMA MEDIA): శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో మార్చి 4వతేదీన కళాశాల ప్రాంగణంలో “మహిళల భద్రత – సురక్షిత రేపటి కోసం అవగాహన నడక” అనే థీమ్తో ఘనంగా వాక్థాన్ కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత, ఆత్మరక్షణ మరియు సమాజంలో మహిళలకు గౌరవం కల్పించాల్సిన అవసరంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో మహిళలు ఆత్మరక్షణ విద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలని, ధైర్యంగా ముందుకు సాగాలని, సమాజంలో ప్రతి ఒక్కరు మహిళల భద్రతకు బాధ్యత వహించాలని తెలిపారు. ఆత్మరక్షణ శిక్షణ మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు.మహిళా సాధికారత కమిటీ (WEC) సమన్వయకర్త శ్రీమతి వి. నాగమణి కూడా కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడటంలో ఆమె కీలక పాత్ర పోషించారు.వాక్థాన్లో విద్యార్థులు శక్తివంతమైన ప్లకార్డులు, నినాదాలతో అవగాహన కల్పించారు. మహిళల భద్రత గణాంకాల ప్రదర్శన, క్విక్ సెల్ఫ్ డిఫెన్స్ ఫ్లాష్ డెమో, వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “నీ భద్రత నీ హక్కు”, “మహిళలకు గౌరవం – మానవత్వానికి గౌరవం”, “బలమైన మహిళలు – సురక్షిత ప్రపంచం” వంటి నినాదాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ప్రత్యేకంగా విద్యార్థినులు ప్రదర్శించిన కరాటే (ఆత్మరక్షణ) ప్రదర్శన కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. IEEE చైర్ మిస్ పి. స్వేత నాయకత్వంలో ఈ మహిళల భద్రత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులకు కరాటే శిక్షణ అందిస్తూ, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.