సూరారం: పండుగ పూట విషాదం.. ఇద్దరి మృతి
సూరారం: పండుగ పూట విషాదం.. ఇద్దరి మృతి
హోలీ పండుగ రోజే నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. హోలీ ఆడిన తర్వాత సూరారం PS పరిధిలో విశ్వకర్మ కాలనీలోని పంతులు చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటికి తీశారు. యువకుల మృతితో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.