ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు
**ఆటోని ట్రేస్ చేసి బ్యాగ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు,
*బ్యాగులో 40 తులాల గోల్డ్ 3 లక్షల అమౌంట్
ఖమ్మం జిల్లా...
ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100 కు ఒక వ్యక్తి శ్రీశ్రీ హోటల్ దగ్గర నా బ్యాగ్ ఆటోలో మిస్సయిందని అని కాల్ చేయడంతో వెంటనే బ్లూ కోర్స్ కానిస్టేబుల్స్ నర్సింహారావు, హనుమంతరావు లు ఇద్దరు వెంటనే అక్కడికి వెళ్లి పది నిమిషాల్లో చెరువు బజార్ దగ్గర ఉన్న ఆటోను ట్రేస్ అవుట్ చేసి ఆ ఆటోలో ఉన్న బ్యాగును తీసుకొని తిరిగి పోలీస్ స్టేషన్ కు వచ్చి డయల్ 100 కు కాల్ చేసిన వ్యక్తికి స్టేషన్కు పిలిపించి అతని బ్యాగు అందజేయడం జరిగింది.
ఆ బ్యాగులో *40 తులాల గోల్డ్, మూడు లక్షల ఎమౌంటు* ఉన్నాయి.. పదే పది నిమిషాల్లో ఆటోను ట్రేస్ అవుట్ చేసి ఆ బ్యాగులో విలువైన వస్తువులను కాపాడినందుకు గాను ఆ బ్లూ కోర్స్ కానిస్టేబుల్ లను పోలీస్ ఉన్నత అధికారులు వారిని అభినందించారు...👏👏
పోలీస్ అన్నలకు అభినందనలు🙏