తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు ₹ 389
కోట్ల రూపాయలు విడుదల
*రాష్ట్రఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,
తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*** ఫిబ్రవరి 28 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
గ్రామ పంచాయతీలకు శుభవార్త – రూ. 389 కోట్లు విడుదల
గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి Mallu Bhatti Vikramarka ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు రూ. 389 కోట్లు విడుదల చేశారు.
ఈ నిధులు గ్రామస్థాయి అభివృద్ధి పనులు, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు మరియు ఇతర అత్యవసర అవసరాల కోసం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రామపంచాయతీల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం, గ్రామీణాభివృద్ధికి వేగం తీసుకురావడం, స్థానిక సంస్థలను మరింత శక్తివంతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు సమయానికి విడుదల చేస్తుందని స్పష్టం చేశారు.
********"*********************
*Gram Panchayats 389CroresReleased
*Rural Development *Village Development,
*Local Bodies
*Infrastructure Development Team Telangana
**Mallu BhattiVikramarka Telangana Government,