చోడవరం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలం పాపంపేట గ్రామానికి చెందిన సబ్బవరపు శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ చోడవరం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికపై పలువురు విలేకరులు, స్థానికులు శ్రీనివాసరావుకు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంతీయ జర్నలిజంలో కృషి చేస్తున్న శ్రీనివాసరావు, అందరి మద్దతుతో ఈ పదవిని స్వీకరించారు. తనకు ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు