రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో ఆదాయం గణనీయంగా పెరుగుదల
రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో ఆదాయం గణనీయంగా పెరుగుదల
రాజాం: విజయనగరం జిల్లా.
రాజాం శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతర మహోత్సవాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందని ఈవో బి.వి. మాధవరావు వెల్లడించారు. ప్రత్యేకాధికారి, నవదుర్గ అమ్మవారి ఆలయం ఈవో శ్యామలరావు పర్యవేక్షణలో గురువారం జాతర ఆదాయం లెక్కింపు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం—
👉హుండీ ఆదాయం గత ఏడాది రూ. 12,85,646 ఉండగా, ఈ ఏడాది రూ. 14,07,330కి పెరిగింది.
👉రూ.100 టిక్కెట్లు గత ఏడాది 3050 అమ్ముడవగా రూ. 3,05,000 ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 3945 టిక్కెట్లు అమ్ముడై రూ. 3,94,500 ఆదాయం నమోదైంది.
👉మొక్కుబడి టిక్కెట్లు (గత ఏడాది రూ.10) ద్వారా రూ. 2,66,700 రాగా, ఈ ఏడాది (రూ.20) ద్వారా రూ. 1,75,240 ఆదాయం వచ్చింది.
👉రూ.50 స్పెషల్ దర్శనం గత ఏడాది 7777 టిక్కెట్లు అమ్ముడై రూ. 3,88,850 రాగా, ఈ ఏడాది 9250 టిక్కెట్లు అమ్ముడై రూ. 4,62,600 ఆదాయం వచ్చింది.
👉కానుకలు రూపంలో గత ఏడాది రూ. 60,858 రాగా, ఈ ఏడాది రూ. 1,78,711 ఆదాయం వచ్చింది.
👉అద్దాలు, భరిణిలు విభాగం ద్వారా రూ. 5,000, ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 92,000 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
మొత్తంగా గత ఏడాది రూ. 23,94,054 ఆదాయం నమోదు కాగా, ఈ ఏడాది రూ. 27,15,381 ఆదాయం నమోదై దాదాపు రూ. 4 లక్షల మేర పెరుగుదల కనిపించిందని ఈవో పేర్కొన్నారు.
భక్తుల స్పందన పెరగడం, జాతర ఏర్పాట్లు మెరుగుపడడం వల్లే ఆదాయం పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు.