గుడిపాడు శ్రీ మోక్ష వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ పూజల్లో పాల్గొన్న కొత్వాల దంపతులు
తెలంగాణ స్టేట్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా *పాల్వంచ* ఫిబ్రవరి 25*( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
****************"***************
*గుడిపాడు శ్రీ మోక్ష వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ పూజల్లో పాల్గొన్న
--- *రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల దంపతులు*
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని *పాల్వంచ 9వ డివిజన్ గుడిపాడులో* నూతనంగా పునర్నిర్మాణం జరిగిన *శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ 5వ రోజు పూజలు* ఘనంగా నిర్వహించారు. బుధవారం *పూజారి సింహాద్రి కందాల ఆనందకుమారా చార్యులు* ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ప్రత్యేక హోమ పూజల్లో రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి దంపతులు పాల్గొన్నారు. అనంతరం దేవాలయం విశిష్టతలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత, 9వ డివిజన్ కార్పొరేటర్ చరపా శాంత, కార్పొరేటర్లు పైడిపల్లి జయలక్ష్మి, దంతేబోయిన నరేష్, ధర్మసోత్ నరేష్, కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, కోండం వెంకన్న గౌడ్, SVRK ఆచార్యులు, డాక్టర్ యుగంధర్ రెడ్డి, కొత్తా వెంకటేశ్వర్లు, పైడిపల్లి మహేష్, వాసుమల్ల సుందర్ రావు, కందుకూరి రాము, దారా చిరంజీవి, K మహీధర్, సందుపట్ల శ్రీనివాస రెడ్డి, రేనాటి శ్రీనివాసరావు, సందు ప్రభాకర్, మాలోత్ కోటి నాయక్, చరపా పాపారావు, రాములు నాయక్, బ్యాంకు చారి, డిష్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.