" అబద్ధాలకే కిరీటాలు" కవితకు సంజయ్ కు ప్రశంశల జల్లు
శ్రీ శ్రీ కళావేదిక నిర్వహించిన ఆన్లైన్ కవిత పోటీలలో నేటి సమాజ పోకడను ఎండగడుతూ" అబద్ధాలకే కిరీటాలు"అను వైవిధ్యమైన అంశంపై సాలూరు టౌన్ కి చెందిన గొల్లపల్లి. సంజయ్ బాబు రాసిన ఉత్తమ కవిత గా నిలిచింది. సంజయ్ కు ప్రశంసాపత్రం అందజేసి అభినందనలు తెలిపారు.దీంతో సంజయ్ కు ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా సాహిత్య ప్రియులు 4వ వార్డ్ కౌన్సిలర్ గొల్లపల్లి. వరప్రసాద్,కౌన్సిలర్ సింగారపు. ఈశ్వరరావు,ముగడ.ప్రసాద్, నిమ్మకాయల. విజయ్ కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.