24/02/2026 AIMIM నాయకులు జైలులో ఉన్నవారిని పరామర్శించారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ AIMIM జనరల్ సెక్రటరీ సయ్య ద్ ఖాన్ ఆధ్వర్యంలో నాయకులు జైలులో ఉన్న వారిని పరామర్శించారు. ఘటనకు సంబంధించి కేసుల్లో ఉన్న వారిపై చట్టపరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని సయ్యద్ ఖాన్ తెలిపారు. న్యాయపరంగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో AIMIM కౌన్సిలర్ లాయక్ అహ్మద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.