నిరుపేదకుటుంబానికి ఆర్థికసహాయంచేసిన సర్పంచ్
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గ్రామస్థులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామస్తుడైన థౌటి మల్లేశం గత నెల జనవరి 23 తేదీన అనారోగ్యం వలన మరణించడం జరిగింది నిరుపేద కుటుంబం కావున సర్పంచ్ సిర్రం నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కుల సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు గ్రామస్తులు లయన్స్ క్లబ్బు అందరూ కలిసి సుమారు 127250/-చందాలు జమచేసి వారి కూతురి పేరు మీద 105000/-ఐఓబి బ్యాంకులో ఫిక్స్ చేసి మిగతా డబ్బులు వారికి ఖర్చులకు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సహకరించిన అందరికీ సర్పంచ్ చిర్రం నాగరాజు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ గుమ్మడి సతీష్, వంగ మల్లారెడ్డి, గుర్క పర్సరాములు, ఉతర్ల లక్ష్మణ్, జలపాతరెడ్డి ‘ దేవరాజు, ఖాజా, వెంకటరెడ్డి ’దేవయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు