మర్రి నరేష్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సమీపంలో బస్సు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)కి చెందిన ఒక ఎక్స్ప్రెస్ బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న వాగులోకి దూసుకెళ్లింది ఉట్నూర్ సమీపంలోని ఒక వంతెన వద్ద ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు మలుపు వద్ద డ్రైవర్ అజాగ్రత్తగా కట్ చేయడం వల్ల లేదా నియంత్రణ కోల్పోవడం వల్ల బస్సు వాగులోకి పడిపోయినట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.