logo

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఒడిశా ఆర్టీసీ బస్ బోల్తా 7గురికి తీవ్ర గాయాలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ బైపాస్ రోడ్ లో బోల్తాపడిన ఒడిశా ఆర్టీసీ బస్.
ఒరిస్సా జగదల్ పూర్ నుండి విశాఖపట్నం వెళ్తున్న ఒరిస్సా RTC బస్సు తెల్లవారు జామున సాలూరు బైపాస్ రోడ్డు వద్ద బస్ స్టీరింగ్ లాక్ అవ్వడం తో అదుపుతప్పి బోల్తా పడిందని బస్ డ్రైవర్ తెలిపారు. ఈ బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారని వారిలో నలుగురు తీవ్ర గాయాలుపాలు కాగా మిగతా ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని డ్రైవర్ భాస్కర్ తెలిపారు.
క్షతగాత్రులను 108 లో పోలీసుల సహాయం తో సాలూరు హాస్పిటల్ కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించినట్లు తెలిపారు.

18
1537 views