logo

డోర్ టు డోర్ సర్వేలు: సిబ్బంది ఒత్తిడి.. ప్రజల భయం!

అనకాపల్లి జిల్లా. UFS అభియానాలపై తీవ్ర అసంతృప్తి.. పని భారం తప్ప ఉపయోజనం లేదని ఫిర్యాదు: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వాట్సాప్, UFS (అన్‌లూక్డ్ ఫ్యామిలీ సర్వే) డోర్ టు డోర్ అభియానాలు స్థానిక సిబ్బంది, ప్రజలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. 'పని ఒత్తిడి, భారం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు' అంటూ సిబ్బంది గట్టి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రజలు భయం, దొంగల ఆందోళనలో పడ్డారు. సచివాలయ సిబ్బంది కూడా 'సేవలకు సమయం లేదు' అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'వృద్ధులకు వాట్సాప్.. ఏ ఉపయోగం?'స్థానిక మండల సిబ్బంది ప్రకారం, వాట్సాప్ సర్వేలు పూర్తిగా వ్యర్థం. "చదువుకున్న విద్యార్థులకు అవగాహన కల్పించడమే సరిపోతుంది. కానీ 60 నుంచి 70 సంవత్సరాల వృద్ధులకు కూడా వాట్సాప్ సరిసులు, ఉపయోగాలు చెప్పమని ఆదేశాలు. వారికి అర్థమవ్వడం లేదు. రాష్ట్రంలో అన్ని వయసుల కుటుంబాలకు ఒత్తిడి చేసి సర్వే చేయించడం వల్ల పని భారం తప్ప ఏమీ లేదు, .సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా రోజువారీ కాలవ్యవధి 8 గంటల్లో సర్వేలకు అంకితం కావాల్సి వచ్చింది. "ప్రజల సర్వీసులు, సమస్యల పరిష్కారాలకు సమయం లేదు. సర్వేలు రోజూ జరిగితే ప్రజలకు సేవలు ఆలస్యమవుతాయి," అని సచివాలయ ఉద్యోగులు ఆవేదన ప్రకటించారు.UFS సర్వేలు 'OTP, బయోమెట్రిక్‌ భయంతో'ప్రజలు UFS సర్వేలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. "ఏదో ఒక సర్వే అని ప్రతి నెల ఇంటికి వచ్చి OTP అడుగుతారు, బయోమెట్రిక్ తీసుకుంటారు. దీనివల్ల భయందోళన పెరిగింది. ఇలా వివరాలు తీసుకుంటే దొంగలు ఇంటికి పరిగెత్తడానికి దారితీస్తాయి," అని కుటుంబాలు ఫిర్యాది చేస్తున్నాయి. గ్రామాల్లో, నగరాల్లో ఇలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి సర్వేలు డిజిటల్ అవగాహన పెంచే లక్ష్యంతో జరుగుతున్నాయి. UFS సర్వేలు కుటుంబ వివరాలు, ఆరోగ్యం, ఆదాయాల సేకరణకు. కానీ ప్రతి నెల రిపీట్ అవుతున్నాయి, అన్ని వయసులపై ఒత్తిడి సమస్యలుగా మారాయి. సిబ్బంది పని ఒత్తిడి, ప్రజల్లో భయం పెరిగాయి.సమతుల్యత అవసరంస్థానిక నేతలు, సిబ్బంది సూచన, సర్వేలను విద్యార్థులు, యువతపై మాత్రమే పరిమితం చేయాలి. వృద్ధులు, అన్ని కుటుంబాలపై ఒత్తిడి తగ్గించాలి. సచివాలయాల్లో సేవలు సరదాగా జరగాలి. ప్రభుత్వం ఈ ఫిర్యాదులపై త్వరగా స్పందించాలని డిమాండ్ బలపడింది.

0
371 views