20 సవర్ల బంగారం, కేజీ వెండి దొరికింది మున్సిపల్ వర్కర్ నిజాయితీతో .. ఏం చేశాడంటే?*
*20 సవర్ల బంగారం, కేజీ వెండి దొరికింది.. ఏం చేశాడంటే?* తమిళనాడు తిరువారూర్లో దురై అనే మున్సిపల్ వర్కర్ నిజాయతీ చాటుకున్నాడు. నిన్న ఉదయం చెత్తలో ఓ బ్యాగ్ కనిపించడంతో తెరిచి చూడగా అందులో బంగారు నగలు, వెండి వస్తువులు ఉన్నాయి. దాన్ని పోలీసులకు అప్పగించాడు. అందులోని 20 సవర్ల బంగారు నగలు (160 గ్రాములు అంటే రూ.23 లక్షలు), కేజీ వెండిని యజమానులకు ఇచ్చేశారు. కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగలు తిరిగి దొరకడంతో యజమాని ఫ్యామిలీ సంతోషంలో కన్నీరు పెట్టుకుంది..