logo

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు టిడిపి నాయకులు కొండ సుబ్బయ్య

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

టిడిపి నాయకులు కొండ సుబ్బయ్య

కడప జనవరి 18 కదిలించే వార్త

కడప నగరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి నగర్ ఉపాధ్యక్షులు కొండ సుబ్బయ్య ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అని నమ్మి 1982లో నందమూరి తారక రామారావు ప్రజలకు ఏదైనా మేలు చేయాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారని రాజకీయాలంటే భూస్వాములకు ధనికులకు దోపిడిదారులకే ఉండేవని అలాంటి పరిస్థితుల్లో ప్రతి పేదవానికి రాజకీయాలంటే సామాన్యుల దగ్గరికి తెచ్చాడని పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అనే సౌకర్యాలను ప్రతి ఒక్కరికి అందించాలని తపనతో పార్టీ పెట్టారని వాటన్నిటిని విజయవంతం చేశారని తెలిపారు. వృద్ధులకు 75 రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టి నేడు దేశంలో ఎక్కడలేని విధంగా నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ప్రవేశపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పేద ప్రజలకు మేలు జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది అని తెలిపారు కొంతమంది దుష్టశక్తులు కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి వైసిపి వాళ్లను పార్టీలోకి చేర్చుకుంటున్నారన్నారు. పార్టీకి కార్యకర్తలందరిని ప్రతిసారి నిరూపించబడిందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు గుర్తించి కార్యకర్తలకు సమన్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

10
680 views