పూల ప్రసాద్ మృతి కు సంతాపం తెలిపిన వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అనంత
పూల ప్రసాద్ మృతి కు సంతాపం తెలిపిన వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అనంత
శింగణమల మండలం వైయస్సార్ సీపీ కన్వీనర్ పూల ప్రసాద్ మృతి కు అనంతపురం జిల్లా వైయస్సార్ సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి సంతాపం తెలిపారు.
గత కొద్ది రోజులుగా అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న అనంత వెంకటరామిరెడ్డి, సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, తలారి రంగయ్య, ఎన్నారై విభాగం కన్వీనర్ ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి పూల ప్రసాద్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ.. ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయామన్నారు. ప్రసాద్ మృతి పార్టీకు తీరని లోటు అని, ప్రసాద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.