
*మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన*
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు*
శ్రీకాకుళం,జనవరి,13: మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృత దేహాన్ని అరసవల్లి లోని తన స్వగృహనికి సోమవారం ఆయన చేరుకొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, శాసన సభ్యులు గొండు శంకర్ లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన సభ్యునిగా పనిచేసి, అందరి అభిమానిగా, అజాత శత్రువుగా శ్రీకాకుళం నియోజక వర్గానికి విశేష సేలందించిన వ్యక్తి గుండ అప్పల సూర్యనారాయణ అని కొనియాడారు. తెలుగు దేశం పార్టీలో పుట్టి అందులోనే నాలుగు పర్యాయాలు శాసన సభ్యులుగా ఎన్నికై పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసి ముక్కు సూటిగా మాట్లాడి వ్యక్తి అని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అనా తెలిపారు. ఆయన మృతి చాలా బాధాకరమని ఆయన మరణ వార్త తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే వెళ్లాలని వారి సూచనల మేరకు తాను వచ్చినట్లు వివరించారు. పార్టీ ఒక సీనియర్ నాయకుని కోల్పోవడం బాధాకరమన్నారు. గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాట్లు చేయాలని తెలియజేసినట్లు చెప్పారు. అప్పల నారాయణ ఆత్మకు శాంతి కలగాలని, విడచి వెళ్లిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.