logo

రోడ్డుప్రమాద నివారణలో భాగంగా అవగాహన కార్యక్రమం.

నంద్యాల (AIMA MEDIA): రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి సూచనలతో నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చాంద్ బాషా ఆధ్వర్యంలో సోమవారం నంద్యాల పట్టణంలో సిటీ బస్టాండ్ సంజీవనగర్ గేట్ మొదలగు ప్రదేశాలలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు మోటార్ వాహనాల చట్టం (M.V Act) యొక్క నియమాలు మరియు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి కలిగి ఉండడంతో పాటు వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు.ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని మరియు రోడ్డు ప్రమాదాలను నివారించుటకు డ్రైవర్ ప్రక్కన ప్రయాణికులను కూర్చో పెట్టుకొని ప్రజలను రవాణా చేయరాదని మరియు వాహన పరిమితికి మించి ప్రయాణికులను అధిక బరువుతో ఆటోలను నడపరాదన్నారు.నంద్యాల పట్టణంలో పట్టణంలో క్రమశిక్షణగల ట్రాఫిక్ వాతావరణాన్ని పెంపొందించడం కొరకు ఆటోలను ఆటో స్టాండ్ లలో మాత్రమే పార్కింగ్ చేయాలని, ఓవర్ స్పీడ్ తో ఆటోలు నడిపి ప్రమాదంలో పడరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలియజేశారు. పై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు విధించబడతాయని హెచ్చరిస్తున్నారు.

1
564 views