భారతరత్న రతన్ టాటా సేవలు చిరస్మరణీయం * 88 వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ముఖ్య అతిథి డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్,
తెలంగాణ స్టేట్::: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:::కొత్తగూడెం టౌన్ డిసెంబర్ 28 ఏఐఎంఏ మీడియా ప్రతినిధిభారతరత్న రతన్ టాటా సేవలు చిరస్మరణీయం * 88 వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ముఖ్య అతిథి డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్, *కొత్తగూడెం టాటా ఏఐజి బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్, కొత్తగూడెం, డిసెంబర్ 28: (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి) ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతరత్న రతన్ టాటా దేశానికి చేసిన సేవలు మరపు రానివనీ కొత్తగూడెం డి ఎస్ పి అబ్దుల్ రెహమాన్ కొనియాడారు. ఆదివారం కొత్తగూడెం పట్టణంలోని టాటా ఏఐఏ బ్రాంచ్ లో రతన్ టాటా 88 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ.. రతన్ టాటా వంటి మహోన్నత వ్యక్తి భారతదేశం లో జన్మించడం మనందరి అదృష్టమని అన్నారు. ఆయన కేవలం వ్యాపారవేత్త గా కాకుండా, తన సంపాదనలో సింహ భాగాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించి కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు లాభాల కంటే విలువలకే ప్రాధాన్యత నిచ్చిన గొప్ప మానవతావాది రతన్ టాటా అని అన్నారు. భారత పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి అసమాన మైనదని. యువత ఆయన అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. అనంతరం టాటా ఏఐజి లీడర్లు అడ్వైజర్లు 50 మందికి పైగా రక్తదానం చేశారు రక్తదానం అంటే అది ప్రాణదానమే అన్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడంలో టాటా గ్రూప్స్ అగ్ర భాగాన నిలిచాయని అన్నారు. రక్త దాతలను డిఎస్పి అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో టాటా ఏఐఏ బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్ , బామ్ రాహుల్ వెంకటేష్ లీడర్లు అడ్వైజర్లు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.