logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ & కొమిరిశెట్టి ఫౌండేషన్-ముత్యాల ముగ్గుల పోటీలు.....

తేది 26-12-2025' శేర్లింగంపల్లి, చందానగర్ :
మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలే పండుగలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కారించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాలనీలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కాలనీలో పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు 5 ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు హఫీజ్ పేట విలేజిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు కొమిరిశెట్టి సాయిబాబా మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవులు మాట్లాడుతూ " *పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు"* అని అన్నారు. " *ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుంది. పట్టణీకరణ నేపథ్యంలో అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు నానాటికి కనుమరుగవుతున్నాయి. నేటి యువతరంకూడా మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగించేందుకై ఈ పోటీలు నిర్వహిస్తున్నాము"* అని అన్నారు. " *ఈ ముగ్గుల వలన పరిసరాలు పరిశుభ్రతగా ఉంటాయి. గోమయంతో కళ్ళాపి జల్లి బియ్యపుపిండితో ముగ్గులు వేయడం వలన బియ్యపు పిండి తినడానికి చీమలు చేరతాయి. ఆ విధంగా చీమలు క్రిమి కీటకాదులు ఇంటిలోనికి రాకుండా అడ్డుకుంటాయి. ఈ ముగ్గులు వేసే ప్రక్రియలో మహిళలు అనేక శరీరక భంగిమలలో పనిచేయవలసి ఉంటుంది. ఈ వ్యాయామ ప్రక్రియ వలన మహిళలలో అనేక గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కావున ప్రతి మహిళ కూడా ప్రత్యేకించి ఈ ధనుర్మాసం మొత్తం నెలరోజులు అత్యంత ఉత్సాహంగా వేకువ ఝామున లేచి ముగ్గులు వేయడం ప్రారంభిస్తారు"* అని అన్నారు. ఈ పోటీలలో శ్రీమతి విజయలక్ష్మి మరియు రమ్య గార్లు విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీలలో 25 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాలు శ్రీమతి ఆషా మరియు శ్రీమతి రాధ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

11
604 views