logo

*మీడియా అక్రిడిటేషన్ పై ప్రభుత్వం నిర్ణయాలు*

ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో జర్నలిస్టుల, మీడియా సంస్థల బాధ్యత చాలా కీలకమని ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. గత ప్రభుత్వ కాలంలో (2019-2024) అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య 22,000 నుండి 12,000కు తగ్గించారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. సోషల్ మీడియా, యూట్యూబర్లకు కూడా అక్రిడిటేషన్ ఇచ్చే అంశంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేశారన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పాలసీలను పరిశీలించి అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశించారన్నారు. అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం పొంది, ఇప్పటికే జీవో విడుదలయింది.

*@-జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు*

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. 2014-2019 మధ్య కాలంలో భూ కేటాయింపులకు సంబంధించి కొన్ని జీవోలు ఇచ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారధి తెలియజేశారు.

0
100 views