logo

ఫోరెన్సిక్ రిపోర్ట్‌తో వీడిన మిస్టరీ: మంత్రి కుమారుడిపై ఆరోపణలు కల్పితమని నిర్ధారణ...


మంత్రి సంధ్యా రాణి కుటుంబంపై ఇటీవల సాలూరు చెందిన మహిళ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలో ఎస్పీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి కుమారుడు, అనధికార పీఏ సతీష్ పైనా అసత్యమైన ఆరోపణలు చేశారన్నారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేశాక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చాటింగ్, ఇతర ఆరోపణలు కల్పితమని తేలిందన్నారు. మహిళను, ఆమెకు సహాయం చేసిన వ్యక్తిపైన కేసు నమోదు చేశామన్నారు.

12
578 views