logo

ఫోన్‌పే ద్వారా రూ.9,000 లంచం తీసుకోని ఏసీపీ కి చిక్కిన ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జి

జర్నలిస్టు:మాకోటి మహేష్
నిర్మల్ జిల్లా | భైంసా మండలం : ఫిర్యాదిదారుని జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఎఫ్‌టీఏ బిల్లులు తయారు చేయడం తో పాటు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను సిద్ధం చేయడానికి లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి చివరకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) వలకు చిక్కాడు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం తానూర్ ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న జి. భీమన్న, అలాగే బాసర ప్రాథమిక వైద్యశాలలోని సీనియర్ అసిస్టెంట్, ఫిర్యాదిదారుని నుంచి రూ.9,000 లంచాన్ని ఫోన్‌పే ద్వారా స్వీకరించినట్లు అనిశా అధికారులు గుర్తించారు

0
156 views