పెళ్లైన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
*పెళ్లైన 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య*
పెళ్లైన మూడు నెలలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మూసాపేటలో చోటుచేసుకుంది
. చందన జ్యోతి, యశ్వంత్కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది.
అయితే పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.