అరకు: ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై అవగాహణ ర్యాలి
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ డే ఘనంగా జరిపారు. ఈ మేరకు విద్యార్ధులకు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ పై అవగాహణ పరచి, గ్రామాల్లోని ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణపై అవగాహణ కల్పించాలని ప్రిన్సిపాల్స్ డా నాయక్ విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల నుండి రవ్వలగూడ జంక్షన్ వరకు ఎయిడ్స్ వ్యాధి పై అవగాహణ ర్యాలీని నిర్వహించారు. అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ పిఓ లు పాల్గొన్నారు.