logo

నేడు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులు కు మధ్య కాల్పులు జరిగాయి

*విజయవాడ*
జర్నలిస్ట్ : మాకోటి మహేష్

*మహేష్ చంద్ర లడ్డా... అడిషనల్ డి.జి*

*బిగ్ బ్రేకింగ్*

*నేడు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులు కు మధ్య కాల్పులు జరిగాయి*

ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉంది

ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది

ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు

నిఘా వర్గాలు వారి కదలికలు పై ప్రత్యేక దృష్టి పెట్టారు

నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టాం

నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారు

వాళ్ల నుంచి సేకరించిన సమాచారం తో ఎక్కడెక్కడ మావోయిస్టులు లు ఉన్నారని దృష్టి పెట్టాం

యన్టీఆర్‌, కృష్ణా, కాకినాడ,‌కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులు లను పట్టుకున్నాం

ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం

రాష్ట్ర చరిత్ర లో ఇంతమంది కీలక వ్యక్తును పట్టుకోవడం ఇదే ప్రధమం

కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను పట్టుకున్నాం

వెపన్స్ 45, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రి ని పట్టుకున్నాం

మా ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారు

ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు

మా ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసింది

మాకు ముందే సమాచారం వచ్చినా.. వారి పై నిఘా పెట్టాం

వారి ఆలోచనలు, కార్యకలాపాలు ను గమనించాం

అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నాం

తెలంగాణ లో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారు

వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు

అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఎపిలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారు

మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు

వారి మూవె మెంట్, ప్లాన్ల పై ఇతర సమాచారం లేదు

హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారం లో నిజం లేదు

0
0 views