logo

గౌడ్స్ రాజకీయంగా ఎదగాలి గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్


ఈ రోజు గోపా హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు డా. బైరి లక్ష్మీనారాయణ గౌడ్,డా.చిర్ర రాజు గౌడ్ గార్ల అధ్యక్షతన గోపా 23వ కార్తిక వనభోజనాల కార్యక్రమం చిల్డ్రన్స్ పార్క్ లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.వి.శ్రీనివాస్ గౌడ్ జనగామ ఆర్టీఓ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి గౌడులు రాజకీయంగా ఎదిగే విధంగా ప్రతి ఒక్క గోపా నాయకులు గౌడులకు పెద్దన్న పాత్ర పోషించాలని,గౌడుల మూల పురుషుడు కౌండిన్య ముని కార్తీక పౌర్ణమి నాడు జన్మించడం కారణంగా ఈ మాసంలోనే గౌడుల ఆరాధ్య దేవుళ్లను కంఠమహేశ్వరస్వామి, సురమాంబ తల్లి ,రేణుక ఎల్లమ్మ తల్లికి పూజలు చేసి కార్యక్రమం ప్రారంభించారు, అనంతరం వచ్చిన విశిష్ట అతిది బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ మాట్లాడుతూ గౌడులు చైతన్యవంతమైనటువంటి జాతి అని మన కులంలో గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించే దిశలో పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు డాక్టర్ తాళ్లపల్లి రవి రవి, కార్పొరేటర్ పోశాల పద్మ గౌడ్, గోపా మాజీ అధ్యక్షులు బూర విద్యాసాగర్ గౌడ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్,సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదిగిరి గౌడ్, సిఐ రామకృష్ణ గౌడ్, మార్క విజయ్ గౌడ్,గోపా రాష్ట్ర నాయకులు ముంజ వెంకట్రాజ్యం,కోల రాజేష్ గౌడ్, గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి డా,, బొమ్మెర కుమార్ స్వామి గౌడ్, గునిగంటి రమేష్ గౌడ్,పోషల సురేందర్ గౌడ్,తాళ్లపెళ్లి ప్రకాష్ గౌడ్, హరీష్ గౌడ్, మణికంఠ గౌడ్ తదితరులు గోపా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

4
70 views