నార్నూర్: 'పులిని వెంటనే పట్టుకోవాలి'
గాదిగూడ మండలం ఖడోడిలో శనివారం పెద్ద పులి సంచరించి 4 ఎద్దులపై దాడి చేసిన ఘటనతో ఉమ్మడి నార్నూర్ మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే పులిని పట్టుకుని అడవిలోకి వదిలివేయాలని మహార్ బెటాలియన్ అధ్యక్షుడు జాడే రాజేందర్ ఆదివారం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీంరావు, కేశవ్ రావు, సునీల్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.