ములుగు ఎస్పీ ఎదుట లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు
తెలంగాణ :ములుగు జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది.
మంగళవారం, నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు సభ్యులు.. మాడవి కోసి, మాడవి ఇడుమే, మచ్చకి దేవా, మడకం బండి, ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు.
లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ఎస్పీ శబరీష్ తక్షణ సహాయంగా రూ.25,000 అందించారు.
అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టి, పోలీసులను సంప్రదించే మావోయిస్టులకు ఎటువంటి హాని ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు.