logo

నిజామాబాద్‌ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది.

హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

అయితే ఆదివారం సారంగాపూర్‌ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.

అయితే హాస్పిటల్‌ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు.

దీంతో పోలీసులు రియాజ్‌పై కాల్పులు జరిపారు. దీంతో పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రియాజ్‌కు వెంటనే జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు

0
66 views