పల్నాడు జిల్లాలో కాపర్ వైర్ల ముఠా అరెస్ట్: డీఎస్పీ
పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాత్రిపూట పగులగొట్టి, అందులోని కాపర్ వైరును దొంగిలించే ముఠాను నరసరావుపేట పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
పల్నాడు జిల్లాలో ఈ ముఠా 30కి పైగా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని ఆయిల్, కాపర్ వైర్లను అపహరించినట్లు తెలిపారు.