
పవన్ కళ్యాణ్ ఆలోచనతో 25 లక్షల ఆరోగ్య భీమా
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆలోచనతో పుట్టిన పథకం అందరికీ ఆరోగ్యం. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.అధికారంలోకి వచ్చాక అందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తాం అని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అందించనున్నారు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడాలు లేకుండా అన్ని కుటుంబాలకూ ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏపీలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను కల్పించేలా కార్యాచరణ రూపొందించారు. 2,493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,257 రకాల ట్రీట్మెంట్లను హైబ్రిడ్ పద్దతిలో ఉచితంగా ప్రజలకు అందించనున్నారు.మరోవైపు.ట్రీట్మెంట్ కోసం వచ్చేవారికి వీలైనంత త్వరగా అప్రూవల్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. అప్లై చేసుకున్న 6 గంటల్లోనే ట్రీట్మెంట్కు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ కోసం చర్యలు చేపట్టారు. రూ.2.5 లక్షలలోపు ఉన్న ట్రీట్మెంట్లకు సంబంధించిన క్లెయిమ్లు. ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఇక రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లించనుంది. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.43 కోట్ల పేద కుటుంబాలతోపాటు.. 20 లక్షల మంది మధ్య తరగతి, ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని వర్తింపజేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో ఆంధ్రప్రదేశ్లో 10 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం కల్పించింది. కాలేజీలను ఒకే దశలో కాకుండా రెండు దశల్లో నిర్మించనున్నారు.