logo

నడికుడ జి.పి.లో రికార్డుల తనిఖీ - త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక - ప్రభుత్వాలు చట్టాలపై అవగాహన కల్పించాలి : ఎన్.హెచ్.ఆర్.సి. (ఎన్ జివో) డిమాండ్

నడికుడ జి.పి.లో రికార్డుల తనిఖీ

- త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక

- ప్రభుత్వాలు చట్టాలపై అవగాహన కల్పించాలి :
ఎన్.హెచ్.ఆర్.సి. (ఎన్ జివో) డిమాండ్

మల్లాపూర్ :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామ పంచాయతీ లో గురువారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రికార్డుల తనిఖీ చేశారు. పిర్యాదు దారుడు అప్పం చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రికార్డుల తనిఖీలో 2017 నుండి 2025 వరకు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లు లు, తీర్మానాలు, జనరల్ ఫండ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన నిధుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తనిఖీల ప్రతినిధులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం -2005 భారత దేశ ప్రజలకు వజ్రాయుధమని అన్నారు. ఈ చట్టాన్ని ప్రతి భారత పౌరుడు, ముఖ్యంగా యువత ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్య క్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారాం, సీనియర్ ఆర్టీఐ ఆక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి, ఎన్ హెచ్ ఆర్ సి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సాతారపు పద్మ - జనార్దన్, జగిత్యాల నియోజక వర్గ ఇంచార్జ్ సంగెపు ముత్తు, జగిత్యాల పట్టణ అధ్యక్షులు దేవ్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

5
17 views