logo

శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవన్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

దేవస్థానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

దేవస్థానంలో ఈ రోజు (15.08.2024) 79వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించబడ్డాయి.

కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు, పలువురు శాఖాధిపతులు, విభాగాధిపతులు, సిబ్బంది, శివసేవకులు, ఎస్.పి.ఎఫ్ సిబ్బంది, హోంగార్డు సిబ్బంది ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయభవన ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమములో ముందుగా ఆలయసంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతిపూజ జరిపించ బడింది. తరువాత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పమాల అర్పించబడింది.అనంతరం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, హోంగార్డు సిబ్బంది, పతాకవందనం చేశారు. తరువాత కార్యనిర్వహణాధికారి జాతీయపతాకావిష్కరణ చేశారు. అనంతరం జాతీయగీతం ఆలాపించబడింది.అనంతరం కార్యనిర్వహణాధికారివారు ప్రసంగిస్తూ ఎందరో దేశభక్తుల, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలను వివరించారు.ఇంకా వారు తమ ప్రసంగంలో గత సంవత్సరకాలములో దేవస్థానం సాధించిన ప్రగతిని తెలియజెప్పారు. క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోందని, భక్తులరద్దీకనుగుణంగా ఆయా సౌకర్యాలు కల్పించాల్సి అవసరం ఉందన్నారు. భక్తులరద్దీకనుగుణంగా ఆయా సౌకర్యాల కల్పనకు దేవస్థానం తగు చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, క్షేత్రాన్ని అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. క్షేత్రాభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. సిబ్బంది అందరు కూడా క్షేత్రాభివృద్ధిలో తమవంతు పాత్రను పోషించాలన్నారు.
ఈ ప్రసంగంలో వారు దేవస్థానంలోని ఆయా విభాగాలు గత సంవత్సరకాలంగా సాధించిన ప్రగతిని కూడా వివరించారు.
కాగా కార్యక్రమములో భాగంగా పతావిష్కరణ తరువాత సాయిలిక్షిత లిక్షితా నృత్య కళాశాల, నందికొట్కూరు వారు దేశభక్తి గేయాలకు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు.

20
1974 views