ఇంత చెత్త ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండవు: అవినాశ్
AP: పులివెందుల ZPTC ఉపఎన్నికపై YCP MP అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో ఇంత చెత్త ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండవు. ఇతర నియోజకవర్గాల నుంచి వేలాదిమందిని తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచారు. YCP ఏజెంట్లు, ఓటర్లను రానివ్వడం లేదు. ఉదయం 10-11గంటల వరకు మేమే ఓట్లు వేసుకుంటామని సిగ్గులేకుండా చెబుతున్నారు. పోలీసులు వారికే సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఉందో లేదో తెలియదు' అని ఫైరయ్యారు.