గ్రామదేవతలకు ఆషాఢ మాసం చీరలు,పూజా సామాగ్రి పంపిణీ
కొడిమ్యాల, జులై 21: (సూర్యోదయం ప్రతినిధి)
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపెళ్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి,పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాలకు ఆషాఢ మాసం సందర్భంగా పూజా సామాగ్రి,చీరలు,ఒడి బియ్యం వంటి ద్రవ్యాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు మరియు కొండగట్టు గిరిప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో,దాతల సహకారంతో సోమవారం నాడు నిర్వహించారు.ఈ సందర్భంగా అయోధ్య టీమ్ సభ్యులు,కొండగట్టు గిరిప్రదక్షిణ సభ్యులు ఆలయ కమిటీకి,పూజారులకు పూజా సామాగ్రిని అందజేశారు.ఈ కార్యక్రమంలో టీమ్ సభ్యులు ఏనుగు ఆదిరెడ్డి,బాలే గణేష్,ముమ్మాడి రాజమౌళి,వంగల శ్రీనివాస్,అడ్లగట్ట అశోక్,గాజుల లక్ష్మీనారాయణ,వంగరి గణశ్యామ్,ఆలయ అర్చకులు,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.