బీసీసీఐ అంపైర్ పరీక్షల్లో తోట విజయ్ ఉత్తీర్ణత
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో గతనెలలో అహ్మదాబాద్లో నిర్వహించిన బీసీసీఐ అంపైర్ల పరీక్షల్లో విజయనగరానికి చెందిన తోట విజయ్ ఉత్తీర్ణత సాధించారు. జిల్లా చరిత్రలో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అంపైర్ల పరీక్షల్లో తోట విజయ్ బీసీసీఐ అంపైర్ సర్టిఫికేషన్ పొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు సాధించడం విశేషం. అంతేకాకుండా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి అర్హత పొందిన ఏకైక అభ్యర్థి ఇతడే.