
జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష
ఆసుపత్రులు సూపరింటెండెంట్లు, నర్సింగ్ సూపర్డెంట్లు, ఫార్మాసిస్టులతో ప్రత్యేక సమావేశం
విష జ్వరాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్
జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో రాబోయే రోజుల్లో విష జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున ఆసుపత్రి సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఈరోజు కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్ లకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని రకాల మందులు, రీఏజెంట్లు, టెస్టింగ్ కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు.వివిధ హోదాల్లో ఉన్న వైద్య సిబ్బంది సమయపాలన పాటించి 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు .ఇప్పటికే అన్ని ఆసుపత్రులలో కావాల్సిన మందులు రీఏజెంట్లు ,మౌలిక వసతులు మరియు ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసిన క్రమంలో రాబోయే రోజుల్లో రోగు లను ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు. అదేవిధంగా ఆసుపత్రులలో ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి తగిన పరిష్కార ఏర్పాట్లు తాను చేస్తానని , అవసరమైన నిధులు మంజూరు కి ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో ఇన్సులిన్, మలేరియా మందులు అందుబాటులో లేవని వాటి గురించి వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా రాష్ట్ర అధికారులతో మాట్లాడి వాటిని అందుబాటులోకి తీసుకొనిరాడానికి ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు .
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు,ఫార్మసిస్టులు ,నర్సింగ్ సూపరింటెండెంట్ లు మరియు శానిటేషన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.