
దేవాలయ భూములను పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
కొడిమ్యాల, జూన్ 28
కొడిమ్యాల మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయ భూములను కొంత మంది రైతులు ఆక్రమించారన్న సమాచారంతో ఆలయ భూములను అసిస్టెంట్ కమీషనర్ శనివారం పరిశీలించారు.దేవాలయ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమీషనర్ ఎన్.సుప్రియ హెచ్చరించారు.దేవాలయం పక్కన గల భూములను ఆక్రమించిన పలువురి రైతులను పిలిపించి ఆలయ భూముల్లో సేద్యం చేస్తే ఇబ్బందులపాలవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారుల ఆదేశాలు బేఖాతరు చేసి ఆలయ భూములను ఆక్రమించుకొని సాగు చేస్తె వేసిన పంటలను నష్టపోతారన్నారు.ఆక్రమణ దారులు దేవాలయ భూముల్లో తొలగించిన హద్దురాళ్ళను సహాయక కమీషనర్ సమక్షంలో ఆలయ అధికారులు తిరిగి ఏర్పాటు చేశారు.అంతకు ముందు శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించు కున్నారు.వన మహోత్సవం కార్యక్రమంలో బాగంగా నర్సింహస్వామి గుట్టపైన గల పార్కింగ్ స్థలంలో మొక్కలు నాటారు.ఈ పరిశీలనలో దేవాదాయ దర్మాదాయ శాఖ డీవిజన్ పరిశీలకుడు రాజమౌళి,ఈవో వెంకన్న,గ్రామ మాజీ సర్పంచ్ మల్లేశం, ప్రముఖులు రమాపతిరావు, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు,రజినీకాంతాచార్యులు,మనోజ్కుమా రాచార్యులు,జూనియర్ సహాయకుల కమలాకర్,రవి,సిబ్బంది మహేష్,రమేష్ గ్రామస్తులు ఉన్నారు.గత ఆరు నెలల క్రితం ఆలయ భూముల ఆక్రమణపై నల్లగొండ ఆలయ అధికారులు పోలీస్ ఉన్నత అధికారులకు పిర్యాదు చేశారు.ఆక్రమణ భూముల పరిశీలనలో ఉన్నత అదికారుల ఆదేశాలతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ కొడిమ్యాల ఎస్సై ఎస్. సందీప్ ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.