ప్రధాని మోడీ పిలుపుమేరకు *అమ్మ పేరుతో ఒక మొక్క*
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి, జూన్ 28 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
కంచికచర్ల పోలీస్ స్టేషన్ నందు ప్రధాని మోడీ పిలుపుమేరకు *అమ్మ పేరుతో ఒక మొక్క* కార్యక్రమంలో భాగంగా నందిగామ బిజెపి యవమోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో సమాజంలోని ప్రతి పౌరుడు భాగస్వామ్యం అవ్వాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో యవమోర్చా నాయకులు శివకృష్ణారెడ్డి కాలువ మహేష్, నియోజకవర్గ కన్వీనర్ సీతారామయ్య, కోకన్వీనర్ శ్రీనివాసరావు , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, స్టేషన్ రైటర్ చిరంజీవి, కానిస్టేబుల్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.