logo

సొలబొంగు గ్రామానికి రోడ్డు, పాఠశాల మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ మీడియా కధనాలకు స్పందించిన ప్రభుత్వం

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిన్నికోట పంచాయతీ సోలుబొంగు గ్రామానికి చెందిన 12 మంది పిల్లలు చదువు కోసం రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ మూడు కిలోమీటర్ల రైవాడ జలాశయంలో బోటు ఎక్కి తామరబ్బా ఎంపీపీ స్కూల్ వెళ్తున్నారు. అయితే చదువుకోరకు గిరిజన పిల్లలు ఇబ్బందులు, కష్టాల పై మీడియా కధనాలకు ప్రభుత్వం స్పందించింది. దీంతో అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం అరుకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్, జిల్లా సర్వ శిక్ష అభియాన్ అదనపు జిల్లా ప్రాజక్ట్ కో ఆర్డినేటర్ డా ఆర్ స్వామినాయుడు, అనంతగిరి ఎంఈఓ, డిటిడబ్ల్యుఓ గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వీరభద్రపేట నుండి సొల్లు బొంగు గ్రామం వరకు మూడు కోట్ల రూపాయలతో గ్రావెల్ రోడ్డు నిధులను అరకు ట్రైబల్ ఈఈ వేణుగోపాలరావు మంజూరు చేశారు. ఈ రోడ్డు పనులు స్థానిక గ్రామ పెద్దలు డిప్పల దేముడు కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులు ప్రారంభించారు.
అనంతరం సర్వ శిక్ష అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ స్వామి నాయుడు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సొలబొంగు గ్రామానికి చెందిన 3.4.5 తరగతులు చదువుతున్నఐదురు విద్యార్ధులను పినకోట ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో చేర్పించాలని, గ్రామంలో చదువుతున్న మిగిలిన తరగతుల పిల్లలకు నాన్ రెసిడెన్సియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్ధులకు స్కూల్ బట్టలు, పుస్తకాలు, కంచాలు అన్ని సౌకర్యాలు సమకూర్చిస్తామని ఎంఈఓ చెప్పారు. దీనితో గిరిజనులు ఆనందంగా దింసా నిత్యం చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ మార్పుకు కారణమైన జాతీయ, రాష్ట్ర మీడియా లకు ప్రేత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సంబరాల్లో స్థానిక సర్పంచ్ గణేష్, గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు 5వ షెడ్యూల్ సాధన కమిటీ కే గోవిందరావు, స్థానిక గిరిజన సంఘం నాయకులు నందోలి రాజారావు, గెమ్మిలా నేలమ్మ, గేమ్మిలి సత్యం తదితరులు జిల్లా కలెక్టర్ కు, అధికార యంత్రాంగంకు జాతీయ మీడియా ప్రతిధులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

2
122 views
  
1 shares