
బీసీ సంక్షేమ సంఘం చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా సెల్వరాజ్*
*బీసీ సంక్షేమ సంఘం చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా సెల్వరాజ్* చిత్తూరు, , బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర రావు తెలిపారు. చిత్తూరు లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘాన్ని పటిష్టపరిచి బీసీల ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షులుగా చిత్తూరు నగరానికి హరిప్రసాద్ ను నియమించినట్లు తెలిపారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా చిత్తూరు నగరానికి చెందిన మేదర చంద్రను, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా సెల్వకుమార్ ను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కులగణన ను చేపట్టేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాజకీయాల్లోనూ బిసి మహిళలకు కేటాయించే రిజర్వేషన్లను కేంద్రం స్పష్టంగా పేర్కొనాలని కోరారు. కులగనణ చేయడం ద్వారా అర్హులైన బీసీ లందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన అభివర్ణించారు. ఈ సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఙ్ఞాన జగదీష్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.