వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపండి: కలెక్టర్
రెవిన్యూ వినతలన్నింటినీ డిస్పోజ్ చేయడం ముఖ్యం కాదని వాటికి నాణ్యమైన పరిష్కారం లభించేలా చూడాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ ఆధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో అధికారులతో సమీక్ష జరిపారు. ప్రతి సోమవారం కలక్టరేట్కు వచ్చే వినతుల్లో 90 శాతం వరకు రెవిన్యూకు సంబంధించినవే అన్నారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సూచించారు.