logo

మాదకద్రవ్యాల నిర్మూలనకై విద్యార్థుల ర్యాలీని ప్రారంభించిన ఎస్సై సందీప్.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవాల ముగింపు కార్యక్రమం లో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు విద్యార్థుల ర్యాలీని కొడిమ్యాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కొడిమ్యాల ఎస్ఐ సౌదం సందీప్ జెండా ఊపి ప్రారంభించారు. మాదకద్రవ్యాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కొడిమ్యాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకొని డ్రగ్స్ వాడొద్దంటూ నినదించారు. పురవీధుల గుండా ర్యాలీ పోలీసు శాఖ,విద్యాశాఖల సంయుక్త నిర్వహణలో చేపట్టారు. ఈ సందర్భంగా కొడిమ్యాల అంబేద్కర్ చౌరస్తా నుండి అంగడి బజార్ చౌరస్తా వరకు ర్యాలీగా చేరుకొని అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,గ్రామస్తులు, పోలీసు సిబ్బంది డ్రగ్స్ వాడమని డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్, ఎంఈఓ శ్రీనివాస్ లు మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు వెంటనే అందించాలని ఎస్సై సందీప్ కుమార్ సూచించారు. విద్యార్థులే తమ పేరెంట్స్ చెడు వ్యసనాలను మాన్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సందీప్, ఎంఈఓ ఏ.శ్రీనివాస్,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఏ. విజయేంద్ర,పీడీ బూట్ల రాజ మల్లయ్య, గ్రామ కార్యదర్శి వంశీవర్ధన్,ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్, యాంటీ డ్రగ్స్ కమిటీ సభ్యులు బండ్ల భాస్కర్, నర్సయ్య, ఎన్ ఎస్ ఎస్ డైరెక్టర్ పి. తిరుపతి అధ్యాపకులు సుమన్, అనిల్, జయశీల, బాలకృష్ణ రెడ్డి, శ్యామ్ కుమార్, దీక్షిత, ఉపాధ్యాయులు హమీదుల్ల ఖాన్,ప్రణీత,మన్మధ రెడ్డి, తిరుపతిరెడ్డి,అంజయ్య, సంపత్, క్రాంతి కుమార్, రమాదేవి, రాజేంద్రప్రసాద్, అఫ్రోజ్,విమల,రాజ్ కుమార్, కళ్యాణ్, దుర్గాప్రసాద్, పోలీస్ కాన్స్టేబుల్స్ సౌందర్య,మహేష్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు శ్రీధర్, సత్యానందం, ఆయాలు, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

15
965 views