logo

నేడే అమరావతి రథయాత్ర - జగన్నాథ రథ మేళా 27 నుండి 29 వరకు - మహోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభం - 29న "సుమంగళి సుభద్ర" 4 ఎద్దుల బండ్లలో అమ్మవారికి సారె ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారిదాస్ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

నేడే అమరావతి రథయాత్ర
- జగన్నాథ రథ మేళా 27 నుండి 29 వరకు
- మహోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభం
- 29న "సుమంగళి సుభద్ర" 4 ఎద్దుల బండ్లలో అమ్మవారికి సారె
ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారిదాస్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో అమరావతి రథయాత్ర 2025 జగన్నాథ్ రాధ మహోత్సవాన్ని 27న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి దాస్ తెలిపారు. గురువారం రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జి వద్ద జగన్నాథ్ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో చక్రధారిదాస్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రగా పేరుగాంచిన జగన్నాథ్ రధ యాత్రను భవానిపురం సితార గ్రౌండ్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభిస్తారన్నారు. సితార గ్రౌండ్స్ నుండి (6 కిలోమీటర్లు) స్వాతి థియేటర్ రోడ్డు, కనకదుర్గ అమ్మవారి గుడి రోడ్డు, రథం సెంటర్ మీదుగా సీతమ్మ వారి పాదాలు వద్ద 3.5 ఎకరాల విస్తీర్ణంలో 27 నుండి 29 వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెంగాల్ డెకరేటర్స్ చే తయారు చేయబడిన గుండిచ మందిరంలో శ్రీమూర్తుల ప్రత్యేక దర్శనం, రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, బ్రెజిల్, కజకిస్తాన్, అమెరికా, ఇటలీ విదేశీ భక్త బృందంతో హరినామ సంకీర్తనలు అత్యంత వైభవోపేతంగా అలరిస్తాయన్నారు. నగరంలో మొట్టమొదటిసారిగా 29న సుమంగళి సుభద్ర కార్యక్రమంలో 1000 మంది స్త్రీలు 4 ఎద్దుల బండ్లలో ఊరేగింపుగా వచ్చి సుభద్ర అమ్మవారికి సారె సమర్పించనున్నారని తెలిపారు.

పూరి జగన్నాథ్ రథయాత్రను పోలి ఉండే ఈ రథయాత్రలో విజయవాడ నగర ప్రజలంతా ఈ అద్భుత సువర్ణవకాశంలో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొని జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. మూడు రోజుల రథమేళాలో సుమారుగా రెండు లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గోకరాజు గంగరాజు, ఇంటెక్స్ ఇండస్ట్రీస్ అధినేత సుధాకర్ చౌదరి, బలరాం గోవిందా దాస్, వ్రజధాం దాస్, హలధర్ నితాయి దాస్, వేణుదారి దాస్, శ్యామ్ సుందర్ దాస్, ఇతర బ్రహ్మచారీ బృందం పాల్గొన్నారు.

10
591 views